ఈ నెల 26న మంచిరేవులకు సీఎం కేసీఆర్‌

-

ఈ నెల 26న మంచిరేవులకు సీఎం కేసీఆర్‌ వెళ్లనున్నారు. స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 26న కోటి మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని మంచిరేవుల గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

కాగా,వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది స్థానాల్లో అత్యధిక సీట్లు బీఆర్ఎస్ పార్టీనే గెలుచుకోబోతోందని ఆ జిల్లా పార్టీ నేతలకు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేసినట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క స్థానమే దక్కిందని అన్నారు. ఈసారీ ఖమ్మం స్థానాలను పక్కనబెట్టినా 80 సీట్లకు పైగా బీఆర్ఎస్ గెలుస్తుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని…అందులో ఎలాంటి అనుమానం లేదని సీఎం చెప్పినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version