సామాన్యుడిలా ప్రవర్తిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రొఫెసర్ కోదండరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

నామినేటెడ్ పోస్టుల విషయంలో మా పార్టీకి కూడా కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని టీజేఎస్ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తరువాత గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేసారు. తాము తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశామని గుర్తు చేశారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. కానీ ఆ విషయాన్ని గులాబీ నాయకులు గుర్తించడం లేదని ఎద్దేవా చేసారు.

ప్రజా తీర్పును బీఆర్ఎస్ గౌరవించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన కొనసాగదు.. కూలిపోతుంది అని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించడం సరికాదన్నారు. విభజన హామీలు అమలు చేయాలి.. కృష్ణానది జలాల పంపిణీలో రాష్ట్రానికి న్యాయమైన వాటా కల్పించాలని డిమాండ్ చేసారు. కాజీపేటలో కోచ్ వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరారు. భద్రాచలంలో రాముడి గుడికి రక్షణ లేదన్నారు. భద్రచలం ను రక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉందని.. కానీ వాళ్లు ఆ పని చేయలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తన సామాన్య ప్రజలకు కూడా నచ్చుతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రగతి భవన్ ముందు ఉన్న గేట్లు బద్దలు కొట్టినప్పుడు సంతోషం కలిగిందన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version