ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గులో ఇంటిగ్రేటేడ్ స్కూల్ కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడుకి పదవులు ఇచ్చారు. కానీ పేదలకు పదవులు రావద్దా..? అని ప్రశ్నించారు. నాణ్యమైన విద్యను అందిస్తుంటే.. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నేతల మాటలు పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మిత్రుడు ప్రవీణ్ కుమార్ ఏ పార్టీలోనైనా ఉండొచ్చు..అది మీ ఇష్టం. కానీ గురుకుల కార్యదర్శిగా పని చేసిన మీరు విద్య గురించి ఇలా మాట్లాడటం బాలేదన్నారు.

ఎవ్వరితోనైనా చెలగాటం ఆడవచ్చు. కానీ టీచర్లతో చెలగాటం ఆడవద్దు.. పోలింగ్ రోజు బూతుల వద్ద వారి మనపై ప్రతాపం చూపిస్తారు. మిత్రుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్.. పేద విద్యార్తులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించేకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యనందించేదుకు ప్రణాళికలు రూపొందిస్తుంటే.. బీఆర్ఎస్ నేతల మాటలు పట్టుకొని మీరు విమర్శలు చేస్తున్నారు. దొరల కాలంలో పేదలకు విద్య అందలేదని.. విద్యాశాఖ బలోపేతం కోసమే కొత్త నియామకాలు చేపడుతున్నట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version