మాగంటి గోపీనాథ్ మృతిపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికార లాంఛనాలతో మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐజీలో మాగంటి చికిత్సకు అయిన మొత్తం ఖర్చుని ప్రభుత్వమే భరించనున్నట్లు ప్రకటన చేశారు.

ఇది ఇలా ఉండగా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. గచ్చిబౌలిలోని ఏఐజి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. మాదాపూర్ లోని ఆయన నివాసానికి భౌతిక కాయం తరలించారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబానికి ప్రగాఢసానుభూతిని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు కేసిఆర్.