తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కీలక ప్రకటన వచ్చింది. రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గంలో కొత్తగా ముగ్గురికి చోటు కల్పిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఢిల్లీ నుంచి అనుమతి రాగానే సాయంత్రానికి రాజ్ భవన్ నుండి అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఇది ఇలా ఉండగా , తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రతి నెలలో రెండు సార్లు సమావేశాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 15 రోజులకు ఒకసారి మంత్రివర్గ సమావేశాలను నిర్వహించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
విధానపరమైన నిర్ణయాల విషయంలో ఆలస్యం లేకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రతి నెలలో మొదటి మూడవ శనివారం రోజున మంత్రివర్గ సమావేశం నిర్వహించే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు.