చివరి శ్వాస దాకా కేసీఆర్ తోనే ఉంటా – దాసోజు శ్రవణ్

-

చివరి శ్వాస దాకా కేసీఆర్ తోనే ఉంటానని ప్రకటించారు దాసోజు శ్రవణ్. ఏ ఆశయంతో బిజెపిలో చేరామో అవి నెరవేరలేదని, పైగా ఆ పార్టీలో పెట్టుబడిదారులకి అవకాశాలు అన్నట్టుగా ఉందని విమర్శలు గుప్పించారు దాసోజు శ్రవణ్. బిజెపిని వీడి రావడంతో తనకు సొంతింటికి వచ్చినట్టు ఫీల్ అవుతున్న అన్నారు.

ఉద్యమంలో కేసీఆర్ చేయి పట్టుకొని నడిచానని, ఇకమీదట సీఎం కేసీఆర్ ను వదిలి వెళ్ళబోనని స్పష్టం చేశారు. తన చివరి శ్వాస దాకా కేసీఆర్ తోనే ఉంటానని చెప్పారు దాసోజు శ్రవణ్. నిన్న బీజేపీ నుంచి టిఆర్ఎస్ లో చేరిన సందర్భంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు దాసోజు శ్రవణ్.

తనను మళ్ళీ టీఆర్ఎస్ లోకి వచ్చేలా చేసిన మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞుడినై ఉంటానని, టీఆర్ఎస్ లోకి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. టిఆర్ఎస్ దేశానికే తలమానికంగా పనిచేస్తుందని, బిజెపిలో మోసపోయిన రాజకీయాలు నడుస్తున్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version