కూకట్ పల్లిలో తీవ్ర విషాదం.. కానిస్టేబుల్ మృతి

-

ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగరంలో ఎక్కువగా విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎవ్వరూ ఊహించని విధంగా ఓ హెడ్ కానిస్టేబుల్ తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. వివరాల్లోకి వెళ్లితే.. కూకట్ పల్లి దేవీనగర్ లో నివాసం ఉండే సీఐ శేఖర్ ఇంట్లో ఆదివారం బర్త్ డే పార్టీ నిర్వహించారు. ఈ బర్త్ డే వేడుక కోసం సీఐ శేఖర్ ఇంటికి వెళ్ళారు 30 మెంబెర్స్ ఫ్రెండ్స్. ఆ 30 మందిలో 10 మంది పోలీసులు ఉన్నారు.

ఈ పార్టీ జరుగుతున్న క్రమంలో బర్త్ డే పార్టీ లో డిన్నర్ చేస్తుండగా మూడవ అంతస్తు నుండి కిందపడిపోయాడు హెడ్ కానిస్టేబుల్ డేవిడ్. తలకు బలమైన గాయం తగలడంతో ఘటన స్థలంలోనే అక్కడికక్కడే  మృతి చెందాడు. పార్టీ ఇచ్చిన శేఖర్ రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ లో సీఐ గా విధులు నిర్వహిస్తున్నాడు.  కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు 194 bnss కేసు నమోదు చేశారు కూకట్ పల్లి  పోలీసులు. ఈ విషయం పై సీఐ శేఖర్ కుటుంబ సభ్యులు చాలా బాధ పడుతున్నారు. అలాగే కానిస్టేబుల్ కుటుంబ రోధిస్తున్న తీరు చూస్తుంటే కంట తడి పెట్టకుండా ఉండరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version