ఇవాళ, రేపు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

-

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో రెండు రోజుల పాటు (శని, ఆదివారం) పర్యటిస్తారు. శనివారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్ నుంచి బయలుదేరి ఉదయం 10:30 గంటలకు మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండల కేంద్రానికి చేరుకుంటారు. ఎర్రుపాలెం లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మిషన్ భగీరథ పథకంపై అధికారులతో సమీక్ష చేస్తారు.

Deputy CM Bhatti’s visit to Khammam district today and tomorrow

మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి వరకు స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రజా ప్రతినిధులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రికి మధిర క్యాంపు కార్యాలయంలో బస చేస్తారు. ఆదివారం ఉదయం 10 గంటలకు మధిర క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామానికి ఉదయం 10:45 గంటలకు చేరుకొని స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఖమ్మం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు ప్రజాభవన్ కు చేరుకుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version