బార్లు, బీర్ల కోసమేనా తెలంగాణ తెచ్చుకుంది? – వైఎస్ షర్మిల

-

అధికార టీఆర్ఎస్ పార్టీపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. బార్లు, బీర్ల కోసమే తెలంగాణ తెచ్చుకున్నామా? అని ప్రశ్నించారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పులుగా మార్చిన ఘనత కేసిఆర్ ది అని అన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మల్లాపూర్ మండలం ఓబులాపురం వద్ద గ్రామస్తులతో వైయస్ షర్మిల ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కెసిఆర్ తెలంగాణను దోచుకున్నది చాలక ఇప్పుడు దేశాన్ని దోచుకునేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు.

ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, ఉద్యోగాలు లేక నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, అన్ని వర్గాలను నిండా ముంచేశారని మండిపడ్డారు. బంగారు తెలంగాణలో కెసిఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని అన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో చెరుకు ఫ్యాక్టరీని మూసివేశారని.. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చెరుకు రైతులకు మద్దతుగా రేపు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ధర్నాకి దిగుతానని ప్రకటించారు వైఎస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version