హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్..5 విడతల్లోలక్ష డబుల్‌ బెడ్ రూమ్‌ల పంపిణీ

-

 

హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. 5 విడతల్లోలక్ష డబుల్‌ బెడ్ రూమ్‌ల పంపిణీ చేసేందుకు రంగం సిద్దం చేసింది కెసిఆర్ సర్కార్. హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, పంపిణీపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని, సబిత, మహమూద్ అలీ హాజరయ్యారు.

ఇక ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఐదు విడతల్లో మొత్తం లక్ష డబుల్‌ బెడ్ రూమ్‌ల పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు. రెండు మూడు రోజుల్లో డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ల పంపిణీ చేసే తేదీల ఖరారు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ బృందం నిర్ణయం తీసుకుంది. రాజకీయాలకు అతీతంగా ఐదు విడతల్లో మొత్తం లక్ష డబుల్‌ బెడ్ రూమ్‌ల పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version