మంత్రి మల్లారెడ్డి మెడికల్ కాలేజీపై ఈడీ దాడులు

-

తెలంగాణలో మరోసారి ఈడి సోదాలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీ లపై ఈడి అధికారులు ఫోకస్ పెట్టారు. బుధవారం ఉదయం 15 బృందాలు హైదరాబాద్, మహబూబ్నగర్, కరీంనగర్ లోని 6 ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తున్నాయి. కామినేని, ఎన్విఎస్, ప్రతిమ గ్రూప్ సంస్థలతోపాటు మొత్తం 6 మెడికల్ కాలేజీలలో అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి మెడికల్ కాలేజీపై కూడా ఈడీ దాడులు కొనసాగుతున్నాయి.

బొమ్మకల్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో తనిఖీలు చేపడుతున్నారు. మేడ్చల్‌లోని మెడిసిటీ మెడికల్ కాలేజీలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కీలేజీలో తనిఖీలు చేపడుతున్నారు ఈడీ అధికారులు. మెనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీలో అవకతవకలపై విచారణ చేపడుతున్నారు. సీట్ల భర్తీలో భారీగా హవాలా లావాదీవీలు జరిగాయని ఆరోపణ రావడంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 10 మెడికల్ కాలేజీల్లో ఈ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version