చంద్రబాబు అంటే ఓ బ్రాండ్ – సోమిరెడ్డి

-

ప్రకాశం: రాష్ట్రంలో అరాచకాలను బయటపెట్టేందుకు తెలుగుదేశం పార్టీ త్వరలోనే బస్సుయాత్ర చేపట్టబోతుందని తెలిపారు టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం అవినీతిపరుల చేతిలో ఉందన్నారు. అవినీతిపరుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలన్నారు. చంద్రబాబు అంటే ఓ బ్రాండ్ అని.. చంద్రబాబు అధికారంలోకి వస్తే పెట్టుబడులు, కంపెనీలు, ఉపాది అవకాశాలు వస్తాయన్నారు.

ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. బస్సు చార్జీలు, కరెంటు బిల్లులు పెంచుతామని చెప్పి అధికారం లోకి వచ్చారా..? అని ప్రశ్నించారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అరాచక శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు వల్లే సాధ్యం అన్నారు సోమిరెడ్డి. వచ్చే ఎన్నికల్లో వై నాట్ 165 అనే పరిస్దితి వచ్చిందని.. అది ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version