నేడు కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటల రాజేందర్ వెళ్లనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతోంది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ కు కూడా నోటిసులు వచ్చాయి.

ఇక నేడు కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటల రాజేందర్ వెళ్లనున్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల ఏం చెప్పబోతున్నారు అనే దానిపై ఉత్కంఠ నెలకోంది. ఈ నెల 9న హరీష్ రావు, 11న మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరుకావాలని కమిషన్ నోటీసులు జారీ అయ్యాయి.
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాలేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనెల 11వ తేదీన పిసి గోష్ కమిషన్ ముందు… విచారణకు హాజరు కాబోతున్నారు కేసీఆర్.