రిటైర్ అయిన ఉద్యోగులకు తెలంగాణ షాక్ ఇచ్చింది. రిటైర్ అయినవాళ్లను ఉద్యోగంలో కొనసాగనివ్వబోమని ప్రకటించారు డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క. నిన్న కేబినెట్ మీటింగ్ తర్వాత డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు.

అలాగే నిధుల సమీకరణపై అధికారులు తీవ్రంగా దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతీ సోమవారం రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుందని పేర్కొన్నారు డిప్యుటీ సీఎం, భట్టి విక్రమార్క. తాజా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రగతిపై వచ్చే వారంలో సమీక్షచేస్తామన్నారు.
తెలంగాణలో మహిళా స్వయం సంఘాలకు ప్రభుత్వం భరోసా ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సమీక్ష కోసం ఆర్థిక శాఖలో ప్రత్యేక అధికారిని నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు డిప్యుటీ సీఎం, భట్టి విక్రమార్క. ప్రమాదావశాత్తు సభ్యురాలు మృతి చెందితే రూ.10 లక్షల సాయం చేయనున్నట్లు వెల్లడించారు. గత సంవత్సరం చనిపోయిన 385 మంది మహిళలకు రూ. 38.5 కోట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.