ప్రతీ పైసా రాష్ట్ర అవసరాల కోసమే ఖర్చు చేస్తాం : భట్టి విక్రమార్క

-

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజా పాలన దరఖాస్తుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం. ప్రతీ పైసా రాష్ట్ర ప్రజలు అవసరాల కోసమే ఖర్చు చేస్తాం. ఫార్ములా ఈ రేస్ పై మాజీ మంత్రులు అనవసర ఆరోపణలు చేస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ పై ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టింది.  ఫార్ములా ఈ రేసులో ముగ్గురు వాటాదారులున్నారు. 

ఫార్ములా  ఈ రేసు పై మాజీ మంత్రులు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. ఫార్ములా ఈ రేస్ తో రాష్ట్రానికి వచ్చేది ఏమి లేదు. ఫార్ములా ఈ రేస్ పై ట్రై పార్టీ అగ్రిమెంట్ జరిగింది. సెక్రెటేరియట్ బిజినెస్  రూల్స్ ప్రకారం.. అనుమతి లేదు. ఫార్ములా ఈ రేస్ వెనక్కి వెళ్లడంతో ప్రభుత్వానికి నష్టం జరిగిందని పేర్కొంటున్నారు. జరిగిన నష్టాన్ని ప్రభుత్వం కాపాడుతుంటే.. మాజీ మంత్రులు మాత్రం రాష్ట్రానికి నష్టం చేస్తున్నారని పేర్కొంటున్నారు. బిజినెస్ రూల్స్ కి భిన్నంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version