నిజామాబాద్‌లో ఘోరరోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

-

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది.ఇదే విషయాన్ని పోలీసులు సైతం ధృవీకరించారు. బుధవారం ఉదయం నిజామాబాద్ జిల్లా శ్రీనగర్‌లో ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయని సమాచారం.

మృతులు మక్లూరు మండలం చిక్లీకి చెందినగా వారిగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. అయితే, ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు నిర్దారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల డెడ్ బాడీలను పోస్టు మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. తీవ్రగాయాలపాలైన మరొకరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version