ఖమ్మం వరద బాధితులకు సరకులు పంపిన హరీష్ రావు

-

ఖమ్మం వరద బాధితులకు సరకులు పంపే వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఖమ్మం వరద బాధితులకు సరకులు పంపే వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అనంతరం మాట్లాడారు. వరద బాధితులకు ఉడుత భక్తిగా సహాయం చేస్తున్నామని… వరద బాధితులకు సహాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఆగ్రహించారు.

Former Minister Harish Rao sent goods to Khammam flood victims through vehicles

మేము వరద సహాయం చేయడానికి ఖమ్మం వెళ్తే మాపై దాడి చేసి మాపైనే కేసులు నమోదు చేస్తున్నారని… అక్కడి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పై దుమ్మూ ఎత్తి పోశారని ఫైర్ అయ్యారు. సీఎం తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరని… మాకు వస్తున్న స్పందన ను చూసి ఓర్వలేకనే దాడులు చేస్తున్నారని తెలిపారు. బాధితులకు కనీసం అన్నం, నీళ్లు ఇవ్వలేక పోయారని వివరించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version