రేవంత్ రెడ్డి మరో సిక్స్.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు..!

-

రేవంత్ రెడ్డి ఇప్పటికే రెండు సిక్సులు కొట్టారని, త్వరలో మరో సిక్స్ కొట్టబోతున్నారని, హరీష్ స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఫామ్ హౌజ్ లో కూర్చొని కళలు కంటున్నారని, ఇంకా భ్రమల్లో బ్రతుకుతున్నారని, సైకాలజిస్ట్ కి చూపించుకుంటే బెటర్ అని సూచించారు. రైతులు, ప్రజలు అవమాన పడేలా పాలన చేశారని, ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ సర్కార్ ది అని ఫైర్ అయ్యారు.

పార్టీ ఫిరాయింపులను మొదలుపెట్టిందే కేసీఆర్ అని, 1999 లో కాంగ్రెస్ ప్రభుత్వం తరుపున గెలిచిన పాపారావు గారిని చేర్చుకొన్న నాటి నుండే ఫిరాయింపుల పర్వం మొదలైందని, మీ అధికార దాహాం అప్పటినుంచే ప్రారంభమైందని ఆరోపించారు. ప్రజలు మాకు అధికారం కట్టబెట్టిన తర్వాత ఆరు నెలల్లో కూల్చేస్తామని అధికారం కోసం తాపత్రేయ పడ్డారని, మీ మోసపూరిత కుట్రలు, మీ మేకపోతు గాంభీర్యం చూసి మీ వెంట ఉండటానికి ఇష్టం లేక మా దగ్గరకు వస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ మీద నమ్మకం లేక రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి చూసి, ఆయనే తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోగలరన్న నమ్మకంతో మా వద్దకు వస్తున్నారని భావించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version