తెలంగాణలో తహశీల్దార్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

-

రాష్ట్ర వ్యాప్తంగా తహశీల్దార్ల ఎన్నికల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహశీల్దార్లు సొంత జిల్లాలకు తిరిగిపోయే విధంగా అవకాశం కల్పిచాలని తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్  మొదటి నుంచి చేస్తున్న కృషి ఫలించింది. ఇప్పటికే ఇదే విషయమై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ని పలు మార్లు టీజీటీఏ నేతలు కలిసి ఎన్నికల బదిలీలపై వినతిపత్రాలను అందజేశారు.

ఇటీవల రెవెన్యూ మంత్రితో జరిగిన ముఖాముఖీ సమయంలోనూ ఇదే విషయాన్ని టీజీటీఏ బలంగా చెప్పింది. ఎట్టకేలకు బదిలీలకు సంబంధించిన ఐచ్ఛికాలను ఇచ్చుకోవాల్సిందిగా
తహశీల్దార్లకు అవకాశం ఇస్తూ సీసీఎల్ఎ ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల
టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రాములు, మహిళా అధ్యక్షురాలు పి.రాధ, ప్రధాన కార్యదర్శి రమేష్
పాక, సెక్రటరీ జనరల్ పూల్ సింగ్ చౌహాన్ లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీసీఎల్ఎ నవీన్ మిట్టల్ కి ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version