దిల్లీలో గులాబీ జెండా ఉంటే తెలంగాణకు రక్షణ : హరీశ్ రావు

-

దిల్లీలో గులాబీ జెండా ఎంపీలు ఉంటే తెలంగాణకు రక్షణ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అని.. అభివృద్ధి అంటే గులాబీ జెండా అని.. విధ్వంసం అంటే కాంగ్రెస్‌, బీజేపీలని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని.. పచ్చి అబద్ధాలు మాట్లాడే వ్యక్తి బండి సంజయ్‌ అని ధ్వజమెత్తారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఇచ్చాం. రైతుబంధు ద్వారా 11 విడుతల్లో రూ.72 వేలకోట్లు ఇచ్చాం. సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలు. రేవంత్‌ రెడ్డి ఎక్కడికిపోతే అక్కడ దేవుళ్లపై ఒట్లు పెడుతున్నారు. మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి.  హామీలు అమలు చేయాలని కోరిన కేసీఆర్‌ను ముఖ్యమంత్రి దుర్భాషలాడుతున్నారు. కాంగ్రెస్‌ అంటేనే కరువు. ముల్కనూర్‌ ముద్దుబిడ్డ సుధీర్‌కుమార్‌కు ఎంపీ టికెట్‌ ఇచ్చిన ఘనత బీఆర్‌ఎస్‌ పార్టీది. ముల్కనూరుకు మొండిచేయి చూపించిన పార్టీ కాంగ్రెస్‌.  హస్తం పార్టీ వచ్చిన తర్వాత కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌ ఆగిపోయాయి. అని హరీశ్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version