సాయిచంద్ మృతి..ఆస్పత్రి హుటాహుటిన వచ్చిన హరీష్‌ రావు

-

సాయిచంద్ మృతి నేపథ్యంలో..ఆస్పత్రి హుటాహుటిన వచ్చారు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌ రావు. ప్రముఖ కళాకారుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (39) గుండెపోటుతో మరణించారు. ఇక సాయిచంద్ మృతిని కేర్ హాస్పిటల్ వైద్యులు నిర్ధారించారు. దీంతో కేర్ హాస్పిటల్ దగ్గరికి భారీగా వచ్చారు సాయిచంద్ అభిమానులు.

అటు మంత్రి హరీష్ రావు , బాల్కా సుమన్ కూడా ఆస్పత్రికి వచ్చి సాయిచంద్‌ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి నుంచి సాయి చంద్ మృతదేహాన్ని బిఎన్ రెడ్డి నగర్ లోని ఆయన నివాసానికి తరలించారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా,ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అభ్యుదయ భావాలు కలిగిన సాయిచంద్ తెలంగాణ ఉద్యమ సమయంలో ధూంధాం కార్యక్రమాలతో ప్రజలను చైతన్యపరిచారు. ఇప్పటివరకు అనేక పాటలు పాడారు. అందులో ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా’ పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version