ప్రతీ దళిత కుటుంబానికి కూడా దళితబంధు ఇస్తాం: హరీష్ రావు

-

సామాజిక వెనుకబాటు, ఆర్థిక ఇబ్బందులు దళిత కుటుంబాల్లో ఎక్కువ అని… అందుకే పథకాల అమలు ముందుగా దళితుల నుంచి మొదలు పెట్టాం అని మంత్రి హరీష్ రావు అన్నారు. వైన్ షాపుల్లో ఇప్పటికే దళితులకు రిజర్వేషన్లు ఇచ్చాం… మెడికల్ షాపుల్లో, ప్రభుత్వ కాంట్రాక్ట్ లలో దళితులకు అవకాశం ఇచ్చేలా చేస్తున్నాం.. ఇలా అన్నింటిలో దళితులను పైకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హరీష్ రావు అన్నారు. ప్రభుత్వం దళిత సంరక్షణ నిధిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. కాస్త ఆలస్యం అయినా… ప్రతీ దళిత కుటుంబానికి కూడా దళిత బంధు ఇస్తామని స్పష్టం చేశారు. కళ్యాణ లక్ష్మీ పథకాన్ని దళితుల నుంచే మొదలు పెట్టామని అన్నారు. దళితుల అభ్యున్నతికి అంతా ప్రయత్నం చేయాలని హరీష్ రావు కోరారు. ప్రతీ ఊరులో దళిత యువత కోసం లైబ్రరీలు ఏర్పాటు చేయాలని.. దాని కోసం ప్రభుత్వ కూడా ఆర్థిక సహాయం అందిస్తుందని హరీష్ రావు అన్నారు. దేశం సుభిక్షంగా ఉందంటే దానికి అంబేద్కర్ రాసిని రాజ్యాంగమే కారణం అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version