కిషన్ రెడ్డి చెప్పినవన్ని అబద్దాలే – హరీష్ రావు కౌంటర్

-

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినవన్ని అబద్దాలే అంటూ తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధుల మంజూరు పై ప్రజలను గందరగోళం కు గురి చేసేలా కిషన్ రెడ్డి వాదనలు ఉన్నాయని చెప్పారు హరీష్‌ రావు.

harish rao vs kishan reddy

తెలంగాణకు ఇవ్వాల్సిన ఒక లక్ష నలబై మూడు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదో కిషన్ రెడ్డి చెప్పాలని కోరారు. తెలంగాణ కు కేంద్రం ఇచ్చిన నిధులను గుజరాత్ తో పాటు ఇతర రాష్ట్రాలతో పోల్చి చూపడం సరికాదని ఆగ్రహించారు. కేంద్రం చెప్పిన విద్యుత్ సంస్కరణలు అమలు చేయకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం 30 వేల కోట్ల రూపాయలు నష్ట పోయిందని తెలిపారు. త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో కిషన్ రెడ్డి చెప్పిన అబద్ధాల బండారం ఆధారాలతో సహా బయటపెడతామని వార్నింగ్‌ ఇచ్చారు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version