Harish Rao: ప్రతినెలా బీసీ బంధు ఇస్తాం..!

-

సిద్ధిపేట వయోలా గార్డెన్ లో ఆదివారం బీసీ వెల్పేర్ ఆధ్వర్యంలో కులవృత్తుల ప్రోత్సహం కోసం లక్ష రూపాయల గ్రాంట్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరై 33 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని 303 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని.. దశల వారీగా అర్హులైన వారందరికీ అందిస్తామన్నారు. స్వయం ఉపాధి పొందేలా సీఎం కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయల బీసీ బంధుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుల వృత్తులను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేసి వృత్తిపైన ఆధారపడిన వారందరికీ ప్రోత్సాహకంగా లక్ష గ్రాంట్ అందిస్తున్నారని తెలిపారు.

గత ప్రభుత్వాలు బ్యాంకు లింకేజీ పేరిట బీసీలకు ప్రభుత్వం 60 శాతం సబ్సిడీ, బ్యాంకులు 40 శాతం పెడుతూ తదితర కొర్రీలతో ఎన్నో లింకులు ఉండేవని.. ఆ రుణం కోసం షూరిటీ కావాలని తిరిగి తిరిగి చెప్పులరిగేవనీ, కానీ మన సీఎం కేసీఆర్ ఇవేమీ షూరిటీ, డాక్యుమెంట్స్ లేకుండా నేరుగా గ్రాంట్ రూపంలో లక్ష రూపాయలు మీకు అందిస్తున్నారని వివరించారు. బీసీ బందు అందరికీ ప్రతి నెల అందిస్తూనే ఉంటామని తెలిపారు హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version