సిర్పూర్ టీ నియోజకవర్గంలో రచ్చకెక్కిన కాంగ్రెస్ వర్గపోరు..!

-

సిర్పూర్ టి నియోజకవర్గంలో  కాంగ్రెస్ వర్గపోరు రచ్చకెక్కిందనే చెప్పాలి. కాంగ్రెస్ గ్రూప్ వార్ పై ఇటీవల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా  మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఎమ్మెల్సీ దండే విఠల్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు నియోజకవర్గ ఇంచార్జీ రావి శ్రీనివాస్. ఇంచార్జీగా ఉన్న  తనను అస్సలు పట్టించుకోవడం లేదని.. తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.  సహనం పాటించాలని నేను మాక్యాడర్ కు నచ్చజెప్పాను. మరో వర్గాన్ని తయారు చేస్తున్నారు.. కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ దండె విఠల్ పై  రావి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్ని పార్టీలు తిరస్కరించిన వ్యక్తులతో వేరుకుంపటిపెడుతున్నారు. నియోజకవర్గ ఇన్ చార్జీ పదవి నీకు కావాలంటే తీసుకో.. నీ ఎమ్మెల్సీ పదవి నాకిచ్చేయ్. ప్రజల సొమ్మును దోచుకునే వారిని ప్రోత్సహిస్తున్నారు. విఠల్ ను ని కలుస్తా..అదిష్టానం దృష్టికి ఈవిషయాలు తీసుకెల్తానని పేర్కొన్నారు. భూ కబ్జాలు, ఇసుక మాఫియా, దో నంబర్ దందా, అక్రమాలు చేసిన వ్యక్తులను ఆయన వెంట  తిప్పుకుంటున్నారని మండిపడ్డారు.  పాపం ఆయనకు తెలియదుకావోచ్చు..నేరుగా వెళ్లి వారి గురించి ఆయనకే చెబుతాను. లేదంటే అదిష్టానం దృష్టికి తీసుకెల్తానని నియోజకవర్గ ఇంచార్జీ రావి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version