నూతన క్రిమినల్ చట్టాలపై అవగాహన అవసరం : కేంద్రమంత్రి నిత్యానందరాయ్

-

ఐపీఎస్‌లుగా ఎంపికైన వారు కొత్త క్రిమినల్ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ అన్నారు.నేషనల్ పోలీస్ అకాడమీలో 76వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్‌కు కేంద్రమంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.అంతకుముందు ఐపీఎస్‌ల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కఠిన శిక్షణ పూర్తి చేసుకుని దేశ సేవ చేయడానికి వెళ్తున్న ఐపీఎస్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.‘భారతీయ పోలీసింగ్ భవిష్యత్ మీపైన ఆధారపడి ఉందని, భారత పోలీస్ సేవలను అత్యున్నత స్థానంలో నిలబెడతారనే నమ్మకముందని తెలిపారు.

డిజిటల్ యుగంలో టెక్నాలజీతో అప్డేట్ అవుతూ నేర నియంత్రణ, పరిశోధన సామర్థ్యం పెంచుకోవాలన్నారు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ క్రైమ్‌ను కట్టడి చేయడానికి కృషి చేయాలన్నారు. సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ ద్వారా కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. నేరస్తులను పట్టుకుని వారికి త్వరగా శిక్ష పడేలా చూడాలన్నారు.కొత్త క్రిమినల్ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఉగ్రవాదులు,సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరారు. కాగా, 188 మంది ట్రైనీ ఐపీఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకుని విధుల నిర్వహణ కోసం వెళ్తున్నారు. వీరిలో 54 మంది మహిళా ఐపీఎస్‌లు ఉండగా.. ఏపీకి నలుగురు, తెలంగాణకు నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లను కేంద్రం కేటాయించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version