రేవంత్ రెడ్డి నోట ఏనాడూ జై తెలంగాణ నినాదం రాలేదు – కవిత

-

రేవంత్ రెడ్డి నోట ఏనాడూ జై తెలంగాణ నినాదం రాలేదని ఫైర్‌ అయ్యారు BRS MLC కల్వకుంట్ల కవిత. ఒక్కనాడు కూడా అమరులకు నివాళులు అర్పించ లేదు…ఒక్క అమరవీరుల కుటుంబాన్ని పరామర్శించలేదని మండిపడ్డారు. మాది కుటుంబ పార్టీ అంటున్న రేవంత్, మొన్నటి ఎన్నికల్లో 22 కాంగ్రెస్ లోని కుటుంబాలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు? అంటూ నిప్పులు చెరిగారు BRS MLC కల్వకుంట్ల కవిత.

kavitha fires on revanth reddy

రేవంత్ ను యూ టర్న్ ముఖ్యమంత్రి పిలవాలని BRS MLC కల్వకుంట్ల కవిత చురకలు అంటించారు. రేవంత్ సర్కార్ పబ్లిసిటీ ఎక్కువ అయ్యిందని ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నా మీద, జాగృతి పైన ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారు…ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి అనేక ఆరోపణలు నాపై చేశాడని నిప్పులు చెరిగారు కల్వకుంట్ల కవిత. పార్టీ సభకు ప్రభుత్వ నిధులు ఎందుకు వాడుతున్నారు…అధికారికంగా హెలికాప్టర్ వేసుకొని వెళ్లి పార్టీ సభ పెట్టారని ఆగ్రహించారు.

వేదిక, కుర్చీలు,లైట్లు పెట్టినందుకు ప్రభుత్వానికి లెక్కలు చెప్పారా? అని నిలదీశారు. మలి దశ ఉద్యమంలో అమరులైన అమరులకు కుటుంబాలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రియాంక గాంధీ నీ ఏ హోదా లో రెండు గ్యారంటీ లకు అమలు చేయడానికి పిలుస్తున్నారు…ప్రభుత్వ కార్యక్రమానికి ప్రియాంక గాంధీని ఎలా పిలుస్తారని నిలదీశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు కల్వకుంట్ల కవిత.

Read more RELATED
Recommended to you

Exit mobile version