ఫ్లొరోసిస్ మహమ్మారిని ఆరేండ్లలోనే తరిమికొట్టాడు కేసీఆర్ : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

-

నల్గొండ జిల్లాలో ఫ్లొరోసిస్ మహమ్మారిని ఆరేండ్లలోనే తరిమికొట్టాడు కేసీఆర్ అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండలో జరిగిన ఛలో నల్గొండ బహిరంగ సభలో మాట్లాడారు జగదీశ్ రెడ్డి. తెలంగాణ నీటిని ఆంధ్రావాళ్లకు ఇచ్చేందుకు  కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం అయిందన్నారు. 60 ఏండ్లలో కాంగ్రెస్ హయాంలో ఏం జరిగింది.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందనేది అందరికీ తెలుసు అన్నారు.

ఈ నాయకుల ఆగడాలను చూడం.. వినం.. మేము అబద్దాలే మాట్లాడుతాం. ఊరకుక్కల్లాగా దాడి చేస్తామనే వెదవలకు ఏదీ అర్థం కాదు. రెండు నెలలుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు అవుతలోడి చేతిలోకి వెళ్లిపోతే.. ఒక్క రోజు మాట్లాడలేదు. కేసీఆర్ సభ పెడతాడంటే.. వణుకుడు మొదలైందన్నారు. 60 ఏండ్లు ఏం జరిగింది.. 10 ఏండ్లలో ఏం జరిగింది అనేది సీఎం కేసీఆర్ చెబుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version