నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరో శుభవార్త..

-

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు కేసీఆర్ సర్కారు మరో శుభవార్త చెప్పింది. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ భర్తీ కానుంది. మొత్తం 70 ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు ఈనెల 12వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్ లైన్లో స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. రాతపరీక్ష జూలై 17 వ తేదీన నిర్వహిస్తామని, బీటెక్ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు అని అధికారులు పేర్కొన్నారు.

ఇక తాజాగా (TSPSC)లో మరో 3,334 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి తాజాగా ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల్లో.. అటవీశాఖలో 1,668, అగ్నిమాపక శాఖలో 875, ఎక్సైజ్ శాఖలో 791 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. అలాగే మిగతా శాఖల్లోని ఖాళీల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఇటీవల వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, ఉద్యోగ నియామకాల ప్రక్రియకు కూడా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version