కేసీఆర్ డబుల్ ఇంజన్ సర్కార్ లో చేరిపోయారు – సీపీఐ నారాయణ

-

సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత విషయంలో కేసీఆర్ బిజెపి కి లొంగిపోయాడని ఆరోపించారు. కేంద్రానికి మద్దతు ఇస్తామని కేసీఆర్ లొంగిపోయాడన్నారు. ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్నది డబుల్ ఇంజన్ సర్కారే అని.. సీఎం కేసీఆర్ డబుల్ ఇంజన్ సర్కారులో చేరిపోయారని అన్నారు.

విభజన హామీల అమలుపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ – కామ్రేడ్ల కూటమి నిశ్చితార్థం స్టేజ్ లో ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ – సిపిఐ కూటమిగా కలిస్తే కేసీఆర్ కి డిపాజిట్లు కూడా రావు అన్నారు. బిజెపి డైరెక్షన్ లోనే విపక్షాల సమావేశాలకు హాజరుకాకుండా ఎమ్ఐఎం తో కలిసి కేసీఆర్ మూడో ఫ్రంటు ఏర్పాటు చేస్తారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version