కేసీఆర్ మగాడు అయితే గజ్వేల్ నుంచి పోటీ చేయాలి – రేవంత్ రెడ్డి

-

 

కేసీఆర్ మగాడు అయితే గజ్వేల్ నుంచి పోటీ చేయాలి లేదంటే మాడా అని ఒప్పుకోవాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గజ్వేల్ నుండి పోటీ చేస్తే వాళ్లు వేసే ఏ శిక్షకి అయినా నేను సిద్ధం అన్నారు. 80 శాతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోతారు అందులో కేసీఆర్ కూడా ఉన్నాడన్ వెల్లడించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.

కాగా, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక కార్యాచరణకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. రైతులకు రుణమాఫీ చేస్తామన్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. రైతులను నిలువునా మోసం చేసిందని ఆరోపించారు. రైతులతో రాజకీయం చేయడానికి బీఆర్ఎస్ నేతలు రైతు వేదికలకు బయలుదేరారని.. వారిని నిలదీసేందుకు ఈ సమావేశాలు ఎంతో దోహదపడతాయని లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news