ఖమ్మంలో మామిడిచెట్టుకు ఉరివేసుకుని కుటుంబం ఆత్మహత్య

-

ఖమ్మం జిల్లా పెనుబల్లిలో విషాదం చోటు చేసుకుంది. పాతకారాయిగూడెం శివారు మామిడితోటలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె సహా దంపతులు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మామిడితోట వైపు వెళ్లిన ఓ వ్యక్తి ముగ్గురు చెట్టుకు వేలాడుతుండటం చూసి గ్రామస్థులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు.. తల్లిదండ్రులు కృష్ణయ్య(40), సుహాసిని(35), కుమార్తె అమృత(19)గా పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనపై పోలీసులు గ్రామస్థులను.. కృష్ణయ్య ఇంటి పక్క వారిని ఆరా తీశారు. గతకొంతకాలంగా సుహాసిని అరోగ్యం సరిగా ఉండటం లేదని చుట్టుపక్కల వారు పోలీసులకు చెప్పారు. ఈక్రమంలోనే మనస్తాపం చెందిన కుటుంబ సభ్యులు.. ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబం ఆత్మహత్యతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version