కాంగ్రెస్ నాయకుడి కిడ్నాప్ కలకలం.. 30 గంటలుగా !

-

సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. దాదాపు 30 గంటలుగా సూర్యాపేట మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య కనిపించకుండా పోయారు. భార్యాభర్తలు అపర్ణ , శ్రీనివాస్ వివాదం పరిష్కార విషయమై కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు వెళ్లారు సూర్యాపేట మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య.

Kidnapping of a Congress leader

అయితే.. పరిష్కారం మాట్లాడదామని కారుతో సహా ఎల్లయ్యను తీసుకెళ్లాడు శ్రీనివాస్ అనే వ్యక్తి. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎల్లయ్య మాత్రం తిరిగి రాలేదు. శ్రీనివాసే కిడ్నాప్ చేశారని సూర్యాపేట మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో
జగ్గయ్యపేట పీఎస్ లో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. దీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version