సిద్దిపేట నుంచి పోటీ చేస్తా.. ఎవరు వస్తారో తేల్చుకోండి : కోమటిరెడ్డి

-

పార్టీ ఆదేశిస్తే సిద్దిపేట నుంచి పోటీ చేస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ పార్టీ అలాంటి ప్రయోగాలు చేస్తుందని అనుకోవడం లేదని వెల్లడించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ పై ఫైర్ అయ్యారు. కర్ణాటకలో అమలు అవుతున్న పథకాలను చూపించేందుకు హెలికాప్టర్ సిద్దం చేశాను.. ఎవరు వస్తారో బావ, బామ్మర్దులు తేల్చుకోండి. పథకాలు అందడం లేదని కన్నడ ప్రజలు చెబితే ఎంపీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పటికీ అది అప్పుడే కుంగిపోవడం ఆశ్చర్యకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పై ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారని.. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. కేసీఆర్ పని అయిపోయిందని.. తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మాయ మాటలను ప్రజలు ప్రస్తుతం నమ్మే పరిస్థితిల్లో లేరని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version