కేటీఆర్, హరీశ్ రావు బచ్చాలు.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

కేటీఆర్, హరీశ్ రావు బచ్చాలు అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. పోరాటాలకు మారు పేరు నల్గొండ జిల్లా అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జిల్లా పాత్ర కీలకమన్నారు. జిల్లా ప్రజలది దొరలు చెబితే వినే రక్తం కాదన్నారు. బీఆర్ఎస్ లా కాకుండా తాము చేసేదే చెప్పి అధికారంలోకి వచ్చామన్నారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం తగ్గలేదని దుయ్యబట్టారు.

నల్గొండ చిట్టి నాయుడు 3వేల ఓట్లతో గెలిచాడు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి మూసీ కావాలో వద్దో చెప్పాలి. బస్సు కిరాయిలకు లేనోడికి ఇప్పుడు 80 ఎకరాల ఫామ్ హౌస్ ఉందన్నారు. మూసీని ప్రక్షాలన చేస్తే.. ఇప్పుడు నల్గొండ బాగుపడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది. బీఆర్ఎస్ ఈ ప్రాజెక్ట్ ని పక్కకు పెట్టింది. లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం నిర్మిస్తే.. అది కుంగిపోయింది. గ్రావిటీతో నీళ్లు వస్తాయి. భూగర్భ జలాలు పెరుగుతాయి. దీంతో ఫ్లోరైడ్ సమస్య పోతుంది. నల్గొండ జిల్లా వాసులు ఫ్లోరోసిస్ సమస్య ని శాశ్వతంగా పరిష్కరించవచ్చని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version