రుణమాఫీ ప్రకటనపై సంబరాలు జరుపాలని కేటీఆర్‌ పిలుపు

-

 

రుణమాఫీ ప్రకటనపై సంబరాలు జరుపాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పిలుపు ఇచ్చారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేస్తామన్న కేసీఆర్‌ ప్రభుత్వ ప్రకటన పైన గురువారం భారత రాష్ట్ర సమితి సంబరాలు చేయనుంది.

ఇందులో భాగంగానే.. గ్రామం, మండలం, జిల్లా కేంద్రాల్లో రైతులతో భారీగా సంబరాలు నిర్వహణకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం అవుతున్నప్పటికీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఈ సంబరాల తాలూకు కార్యక్రమాలను సమన్వయం చేసుకోవాలని సూచనలు చేశారు. రైతుబంధు సమితులతో పాటు సహకార సంఘాల ప్రతినిధులు కూడా ఈ సంబరాల్లో పాల్గొనాలని కేటీఆర్ పిలుపు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version