జగన్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్.. నన్ను ఓడించడానికి డబ్బులు పంపించారంటూ..!

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీ సీఎం జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జగన్ తనని ఓడించడానికి డబ్బులు పంపించారని మంత్రి కేటీఆర్ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఓ ప్రముఖ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్య్వూలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. 2010లో తెలంగాణ ఉద్యమం తీవ్రంగా కొనసాగుతున్న తరుణంలో తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లానని వెల్లడించారు మంత్రి కేటీఆర్.

ఇక ఆ ఎన్నికల్లో గెలుపు తనకు ప్రతిష్టాత్మకంగా మారిందని తెలిపారు. ఆ సమయంలో కేసీఆర్ కొడుకును అంటే తనను ఓడించడానికి జగన్ భారీగా డబ్బులు పంపించారని.. నా మనిషి ఒకరు తనతో చెప్పారని వెల్లడించారు కేటీఆర్. ఆ సమయంలో జగన్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారని కేటీఆర్ చెప్పారు. వెంటనే తాను డబ్బులు పంపిణీ చేసే వద్దకు వెళ్లగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ వ్యక్తి అక్కడ డబ్బులు పంచుతున్నారని.. అటునుంచి డబ్బులు తీసుకొస్తున్న మహిళలను ఓటుకు డబ్బులు తీసుకుంటున్నారా అని ప్రశ్నించగా.. మొదట ఇద్దరు, ముగ్గురు లేదని చెప్పారని.. తరువాత ఓ మహిళను అడిగితే.. తీసుకున్నాం అన్న అని బదులు ఇచ్చిందని తెలిపారు కేటీఆర్. ఎంత ఇచ్చారని అడగ్గా.. ఓటుకు రూ.600 ఇచ్చారని.. సమాధానం వచ్చిందని.. ఓటు ఎవ్వరికీ వేస్తావని ప్రశ్నించగా.. వాళ్ల దగ్గర డబ్బులు తీసుకున్నా.. ఓటు మాత్రం మీకే వేస్తానని ఆ మహిళా సమాధానం ఇచ్చిందని చెప్పుకొచ్చారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version