గాంధీ భవన్‌లో గాడ్సే దూరిండు… రేవంత్ RSS మనిషి – కేటీఆర్

-

గాంధీ భవన్‌లో గాడ్సే దూరిండు… రేవంత్ RSS మనిషి అంటూ మంత్రి కేటీఆర్ ఫైర్‌ అయ్యారు. రేవంత్ రెడ్డి నోట్లోన్చి వేలకోట్ల మాట తప్ప ఇంకో మాట రాదు. ఆయనకు మతిస్థిమితం లేదని.. ఇది సెక్రటేరియట్ కింద వేల కోట్లు ఉన్నాయని చేసిన పిచ్చి ఆరోపణలు అందరికీ గుర్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బిజెపి పైన ఒక మాట ఎందుకు మాట్లాడడని.. మోడీని బిజెపిని ఒక మాట అనకుండా రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడని ఆగ్రహించారు.

అందుకే గాంధీ భవన్లో గాడ్సే దూరిండు అని మేము చెప్పామన్నారు. రేవంత్ రెడ్డి 100% ఆర్ఎస్ఎస్ మనిషి, బిజెపి మనిషి అని.. మోడీని పల్లెత్తు మాట అనకుండా కాపాడుతున్న వ్యక్తి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సైతం అందించి విచారణ చేయించుకోవచ్చని… ధరణి ద్వారా జరిగిన లబ్ధిని మేము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ప్రజలకు చెప్తం. ఈ అంశాన్ని ప్రజలే తెలచాలని కోరుతామన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా అడ్డగోలుగా డబ్బులు సంపాదించిన రేవంత్ రెడ్డి… ఈరోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ అయితే ఓర్వలేక పోతున్నారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version