ఏపీ రైతులకు శుభవార్త..బీమా పరిహారం విడుదల చేయనున్న సీఎం జగన్‌

-

 

రేపు అనంతపురం జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారను. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ్‌లో వైఎస్సార్ రైతు దినోత్సవంలో పాల్గొననున్నారు సీఎం జగన్‌. ఈ సందర్భంగా 2022 ఖరీప్‌లో పంటలు నష్టపోయిన రైతులకు… ఖరీప్‌–2022 బీమా పరిహారాన్ని అందజేయనున్నారు.

అనంతరం బహిరంగసభలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగానే రేపు ఉదయం సీఎం వైయస్.జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ్‌ చేరుకుంటారు. అనంతరం ఏపీ మోడల్‌ స్కూల్‌ సమీపంలో సభావేదిక వద్దకు చేరుకుని.. డాక్టర్‌ వైయస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బహిరంగసభలో పాల్గొని ప్రజలనుద్ధేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఖరీఫ్‌ –2022లో పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారాన్ని బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version