గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో మహాలక్ష్మి ప్రశ్నలు..!

-

రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈరోజు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు నడుమ పరీక్ష నిర్వహించారు. అయితే ఈ పరీక్షలో వచ్చిన ప్రశ్నల గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ క్వశ్చన్స్ గురించి మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అయితే గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షలో ఏ పరీక్షలు వచ్చిందో తెలుసా

గ్రూప్ -1 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ గృహ జ్యోతి, రూ.500 లకే సిలిండర్, మహాలక్ష్మి పథకానికి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారు. మహాలక్ష్మి పథకం కింద గృహ అవసరాల నిమిత్తం ఎల్బీజీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ధరలకు సరఫరా చేయడం క్రింది వాటిలో దేనికి సంబంధించినది అంటూ నాలుగు ఆప్షన్లతో ఒక ప్రశ్న ఇచ్చారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ గృహ జ్యోతి పథకానికి సంబంధించిన వాటిని గుర్తించండి అని ఇంకో ప్రశ్న ఇచ్చారు. ఇప్పుడు గ్రూప్-1 లో ఈ ప్రశ్నలు రావడం హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version