సిరిసిల్లలో మహిళకు మైక్రో ఫైనాన్స్ వేధింపులు.. 8 గంటలుగా ఇంట్లో కూర్చుని !

-

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహిళను వేధింపులకు గురి చేసిన మైక్రో ఫైనాన్స్ అధికారులు….ఫైనాన్స్ చెల్లించాలని 8 గంటలుగా ఇంట్లో కూర్చున్నారు. మైక్రో ఫైనాన్స్ సిబ్బంది వేధింపులు మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది ఫైనాన్స్ సిబ్బంది. తంగళ్ళపల్లి మండలం కెసిఆర్ నగర్ కాలనీలో కొంతకాలంగా మహిళలు మైక్రో ఫైనాన్సు సంబంధించిన కొన్ని ప్రైవేటు ఫైనాన్స్ ద్వారా అప్పులు తీసుకున్నారు.

Micro finance harassment of a woman in Sirisilla

15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి చొప్పున తీరుస్తున్నారు. మంగళవారం రోజు కూడా ఆ మహిళల వాయిదా ఉండడంతో ఉదయం ఏడు గంటలకు మహిళ సంఘం లీడర్ ఇంట్లోకి వచ్చింది మైక్రో ఫైనాన్స్ సిబ్బంది. ఫ్యూజన్ ఫైనాన్స్ సిబ్బంది మహిళలు కట్టాల్సిన కిస్తీలను ఖచ్చితంగా చెల్లించాల్సిందే అని ఇంట్లో తిష్ట వేశారట. అయితే… పండగ పూట డబ్బులు లేవని, పనులు లేక కుటుంబం గడవడమే కష్టంగా ఉందని ఇప్పుడు కట్టలేమని వచ్చే వాయిదలో చెల్లిస్తామని చెప్పినా కూడా… మైక్రో ఫైనాన్స్ సిబ్బంది దౌర్జన్యంగా వ్యవహరించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version