ఈడి నోటీసులపై స్పందించిన మంత్రి గంగుల కమలాకర్

-

ఇవాళ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబానికి ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈడీ నోటీసులపై స్పందించారు మంత్రి గంగుల కమలాకర్. ఈడి నోటీసులు మీ కుటుంబానికి వచ్చాయన్న సమాచారం పై స్పందించారు గంగుల. అలాంటి ఈడి నోటీసులు రాలేదంటూ స్పష్టం చేసిన గంగుల… శ్వేత గ్రానైట్ కు నాకు ఎలాంటి సంబంధం లేదంటూ స్పష్టం చేశారు.

వ్యాపార పరంగా శ్వేత గ్రానైట్ కు సంబంధించిన లావాదేవీలు శ్వేత గ్రానైట్ చూసుకుంటుందన్నారు. ఆర్బిఐ రూల్ ప్రకారం శ్వేతా గ్రానైట్ లావాదేవీలు లావాదేవీలు జరుగుతాయని.. శ్వేతా గ్రానైట్ కు ఈడి నోటీసులనే ది 2008 నుండి కొనసాగుతుందని వెల్లడించారు. శ్వేతా గ్రానైట్ వ్యాపారం నుండి గాని నానుండి కానీ ఈ డి కి ఎలాంటి సమాచారం అయినా ఇవ్వడానికి పూర్తిగా సహకరిస్తామని ప్రకటించారు మంత్రి గంగుల కమలాకర్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version