మంత్రి హరీష్ రావు కోసం పాదయాత్ర..!

-

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి హరీష్ రావు ట్విటర్ ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల సూచనల మేరకు హోం ఐసోలేషన్‌లో ఉంటూ..  చికిత్స పొందుతున్నారు. దీంతో హరీశ్‌ రావు కరోనా నుంచి తొంద‌రగా కోలుకోవాలని టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు వేములవాడ రాజ‌న్న‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ప‌లువురు టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు సిద్దిపేట నుంచి వేములవాడ వ‌ర‌కు పాదయాత్ర నిర్వహించారు.

స్వామివారిని దర్శించుకుని, హ‌రీశ్ రావు తొంద‌ర‌గా కోలుకోవాల‌ని మొక్కుకున్నారు. పాదయాత్రలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు కూడా పాల్గొన్నారు. ఇకపోతే ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు హరీష్ రావు కరోనా నుంచి  త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version