నేడు సిరిసిల్లా జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

-

 

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో ఉదయం సిరిసిల్ల తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీలో చేరికల కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 11 గంటలకు వేములవాడ పట్టణంలో నిర్వహించే యువ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించే యువ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారని సమాచారం.

Minister KTR’s visit to Sirisilla district today

ఇక నిన్న షాద్‌ నగర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్‌. సీఎం కేసీఆర్ ను ఎదుర్కోవడానికి ఢిల్లీ దొరలు దిగి రావాల్సి వస్తోందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. ఓవైపు కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్, ఇతర నేతలు…. మరోవైపు పీఎం మోడీ, అమిత్ షా ఇక్కడికి వచ్చే ప్రచారం కొనసాగిస్తున్నారని చెప్పారు. ‘రాష్ట్రంపై ప్రేమలేని ఈ నాయకులంతా ఎన్నికలు రావడంతోనే ఇక్కడికి వస్తున్నారు. అమలు చేయలేని హామీలు ఇస్తున్నారు. 2014 నుంచి దొరల పాలన సాగిస్తోంది బిజెపినే’ అని మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version