ఆర్టీసి సిబ్బంది, బస్సులపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదు – పొన్నం

-

ఆర్టీసి సిబ్బంది, ఆర్టీసి బస్సులపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మహాలక్ష్మి పథకం అమల్లో ఉన్నందున మహిళ ప్రయాణికుల రద్దీ పెరిగిందని వివరించారు. బస్సులపై ఓవర్ లోడ్ అవుతున్న విషయం మా దృష్టికి వచ్చిందని తెలిపారు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. 80 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.

Minister Ponnam Prabhakar inaugurated 80 new buses

ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…పురుష ప్రయాణికుల విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు కు సంబంధించి చర్యలు తీసుకుంటాం..సంక్రాంతి బస్సుల చార్జీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహిళలు ఉచిత ప్రయాణం కల్పించారు…ఉచిత టికెట్ మీద ఇప్పటి వరకు 6 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని తెలిపారు. 1050 కొత్త బస్సులు 400 కోట్లతో కొనుగోలు చేస్తున్నాం…ఖాకీ బట్టలతో ఉన్న ఆర్టీసి సిబ్బంది సంస్థను కాపాడుకుంటున్నారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news