తెలంగాణ మంత్రి ఉత్తమ్ ఇంట తీవ్ర విషాదం

-

తెలంగాణ మంత్రి ఉత్తమ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్‌ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి కన్నుమూశారు. దీంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.

Minister Uttam Kumar Reddy’s father Purushottam Reddy passed away

అటు కాసేపట్లో ఆయన నివాసానికి భౌతిక కాయం చేరుకోనుంది. ఇవాళ సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానం లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి అత్యక్రియలు జరుగనున్నాయి. మా తండ్రి గారు పురుషోత్తమ్ రెడ్డి గారు ఈ రోజు ఉదయం స్వర్గస్తులయ్యారని తెలియజేయుటకు చింతిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో జరుగుతాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version