ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త అందజేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు రాకపోతే మక్తల్ లోని తన ఇల్లును అమ్మి డబ్బులు చెల్లిస్తానంటూ మంత్రి శ్రీహరి సంచలన కామెంట్లు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలలలోనే లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందిస్తున్నామని శ్రీహరి చెప్పారు.

ఇళ్ల సర్టిఫికెట్ పొందిన వారు ఎలాంటి భయం లేకుండా ఇళ్లను నిర్మించుకోవచ్చు అని మంత్రి శ్రీహరి అన్నారు. తమది చేతల ప్రభుత్వమని మాటల ప్రభుత్వం కాదంటూ మంత్రి శ్రీహరి సంచలన కామెంట్లు చేశారు. కాగా, ఇందిరమ్మ ఇళ్లకు లబ్ది అయినవారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది మంత్రి చేసిన ఈ కామెంట్లపై సీరియస్ అవుతున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు రాకుంటే నా ఇల్లు అమ్మైనా సరే డబ్బులు ఇస్తా – మంత్రి వాకిటి శ్రీహరి pic.twitter.com/mLhngxUIcT
— Telugu Scribe (@TeluguScribe) June 28, 2025