వరంగల్లో దారుణం జరిగింది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని మహిళను వివస్త్రను చేసి, ప్రైవేట్ పార్ట్స్లో జీడి పోసి హింసించారు భార్య, ఆమె కుటుంబ సభ్యులు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామానికి చెందిన గంగా అనే యువతికి, ములుగు మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన రాజు అనే యువకుడికి ఇచ్చి పదేళ్ల క్రితం పెళ్లి చేశారు.
రాజు సమీప బంధువైన ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకొని, పది రోజుల క్రితం ఆమెతో కలిసి ఊరు విడిచి వెళ్లిపోయాడు.. దీంతో సొంతింటికి వెళ్లిన గంగా జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. వారు ఆ ఇద్దరినీ వెతికి పట్టుకొని ఐదు రోజుల క్రితం తాటికాయల గ్రామానికి తీసుకువచ్చి విచక్షణారహితంగా దాడి చేసి, ఇద్దరికీ గుండు గీయించారు.
ఆ మహిళను ఓ మంచానికి కట్టేసి వివస్త్రను చేసి జననాంగంపై జీడీ పోశారు. తప్పు చేశాను క్షమించండని వేడుకున్నా, జననాంగంలో నుంచి తీవ్ర రక్తస్రావమవుతున్నా వివాహితను వదలలేదు.. ఆ తరువాత ఆ ఇద్దరి ఆచూకీ తెలియలేదు. సుమోటోగా కేసు నమోదు చేసి.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు.