ఈటెల రాజేందర్ కెసిఆర్ కాలిగోటికి కూడా సరిపోడు – కౌశిక్ రెడ్డి

-

ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలతో టిఆర్ఎస్, బిజెపి నేతల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తా.. ఓడిస్తానని ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలతో టిఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈటెలపై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ, హుజరాబాద్ నియోజకవర్గ నేత పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటెల రాజేందర్ కెసిఆర్ కాలిగోటికి కూడా సరిపోడని అన్నారు.

మంగళవారం కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హుజరాబాద్ లో ఈటెల కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. సొంత నియోజకవర్గ హుజరాబాద్ నుంచి పోటీ చేసి గెలవాలని ఈటలకు సవాల్ విసిరారు. హుజురాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా ఈటెల అంటూ సవాల్ విసిరారు. ఉప ఎన్నిక తర్వాత హుజరాబాద్ లో లక్ష రూపాయల అభివృద్ధి కూడా చేయలేదంటూ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version