హైడ్రా కూల్చివేతలు.. సీఎం రేవంత్ రెడ్డి పై ఎంపీ ఈటల సీరియస్..!

-

హైడ్రా కూల్చివేతలపై  మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్ద పెద్ద వాళ్ల అక్రమ నిర్మాణాలు పక్కకు పెట్టి.. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వచ్చాకే కాంగ్రెస్ పార్టీ పుట్టలేదని.. వందలాది సంవత్సరాల నుంచి ఉందన్నారు.

గత నాలుగు రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనే హీరో అనుకొని హైడ్రామా చేస్తున్నారని సీరియస్ అయ్యారు. గతంలో అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలు చేసి కేసీఆర్ ఫొటోలకు పోజులిచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోజులిస్తున్నారని మండిపడ్డారు. పెద్ద పెద్దవాళ్ల అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు మంచిదే.. కానీ పేదలపై తన ప్రతాపం చూపించొద్దని ఎద్దేవా చేశారు. దాదాపు 40 ఏళ్ల కిందటే.. FTL లో ప్రభుత్వ అనుమతులతో పేదలు ఇళ్లు కట్టుకుంటున్నారు. అనుమతులు ఇచ్చిన కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్లు సంబంధిత అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు ఎంపీ ఈటల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version